Wednesday, July 16, 2025

మేడ్చల్ పట్టణం లో స్కూల్స్ కి వెళ్ళాలంటే  ట్రాఫిక్ జామ్ తో ఇబ్బంది పడుతున్న విద్యార్థులు

Q6 news web site

మేడ్చల్ పట్టణంలోని ఆర్టీసీ కాలనీ నుండి పాఠశాలకు వెళ్లే విద్యార్థులు రోడ్డు దాటాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు,

  NH 44 main రోడ్ అవతలి వైపు  , నాగార్జున స్కూల్, శ్రీ చైతన్య ,సైబరేజ్,  ,ఇలాంటివి పెద్ద పెద్ద  పాఠశాలలు వున్నాయి

   ఈ పాఠశాలలకు వేల సంఖ్యలో విద్యార్థులు ఆర్టీసీ కాలనీ రోడ్డు క్రాస్ చేసి అవతలి వైపు వెళ్లాల్సి ఉంటది,   అక్కడికి వెళ్లాలంటే ఈ రోడ్డు దాటాల్సిందే   ఉదయం   సాయంత్రం సమయంలో ట్రాఫిక్ తీవ్రంగా ఉండడంతో స్కూలుకు వెళ్లే సమయంలో రోడ్డు దాటాలంటే  ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ దాటాల్సిన పరిస్థితి, ఏ వైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తదో అని భయపడుతూ  తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు ప్రజలు ఇదంతా చూస్తున్న నోరు మెదపని నాయకులు అధికారులు ఇప్పటికైనా విద్యార్థుల బాధలు అర్థం చేసుకొని ఉదయం సాయంత్రం ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేసి పిల్లలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు    

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News